ETV Bharat / entertainment

ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం, షూటింగ్స్​కు గ్రీన్​సిగ్నల్, ఆరోజు నుంచే షురూ

author img

By

Published : Aug 23, 2022, 6:23 PM IST

సినిమా షూటింగ్స్​కు ప్రాధాన్య క్రమంలో అనుమతించనున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి షూటింగ్స్ ప్రారంభించనున్నట్లు తెలిపింది.

MOVIE SHOOTINGS
MOVIE SHOOTINGS

టాలీవుడ్ సినిమా షూటింగ్స్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. షూటింగ్స్​ను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుగు నిర్మాతల మండలి ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ప్రాధాన్య క్రమంలో సినిమా షూటింగ్స్‌కు అనుమతిస్తామని తెలిపింది. టాలీవుడ్‌లో ఈనెల 1న షూటింగ్స్ ఆగిపోయాయి. అప్పటి నుంచి తెలుగు సినిమా చిత్రీకరణలు జరగడం లేదు. నిర్మాతల సమస్యల పరిష్కారానికి వీలుగా షూటింగ్స్​ను నిలిపివేశారు.

కరోనా పాండెమిక్ తరువాత మారిన పరిస్థితులు, పెరిగిన బడ్జెట్లు సహా.. కనీస వేతనాలు పెంచాలని టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్ట్​లు సమ్మెకు దిగిన నేపథ్యంలో నిర్మాతలు ఆర్థికంగా నష్టపోతున్నారని ప్రొడ్యూసర్స్ గిల్డ్ భావిస్తోంది. సినిమాల నిర్మాణం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాతల మండలి.. షూటింగ్స్ నిలిపివేసింది. ప్రస్తుత పరిణామాలపై లోతైన చర్చలు జరిపింది. సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాకే సినిమాల షూటింగ్​లను తిరిగి ప్రారంభించాలని గతంలో నిర్ణయించింది.

చర్చల్లో భాగంగా ఓటీటీల్లో సినిమా విడుదల చేసే విషయమై నిర్మాతలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. సినిమా థియేటర్​లో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకొస్తామని సినీ నిర్మాత దిల్‌రాజు ఇటీవల వెల్లడించారు. అలాగే థియేటర్‌, మల్టీప్లెక్స్‌లలో టికెట్‌ ధరలు, తిను బండారాల ధరలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.