ETV Bharat / entertainment

సర్కారువారి పాట.. 12 రోజుల్లో రూ.200 కోట్ల వసూళ్లు - 'మేజర్' సాంగ్​ రిలీజ్​​

author img

By

Published : May 25, 2022, 1:28 PM IST

sarkari vari pata
సర్కారువారి పాట

మహేశ్​బాబు హీరోగా నటించిన 'సర్కారువారి పాట' సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. కేవలం 12రోజుల్లోనే రూ.200 కోట్లను రాబట్టింది. అలాగే మేజర్​ సినిమాలో 'హృదయమా' సాంగ్​ అప్డేట్​ మీకోసం..

సూపర్​స్టార్​ మహేశ్​బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'సర్కారువారి పాట' భారీగా వసూళ్లను రాబడుతోంది. కేవలం 12రోజుల్లోనే.. రూ. 200కోట్లు వసూలైనట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ తెలిపింది. సినిమా భారీ ఓపెనింగ్స్​తో మొదలైన అదే జోరును ఇంకా కొనసాగిస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు 2.3 మిలియన్ ప్లస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.156.9కోట్ల గ్రాస్‌.. రూ.100.01కోట్ల షేర్​ను రాబట్టింది ఈ సినిమా. అలాగే అన్ని ఏరియాలు మొత్త కలిపితే.. 122.09 కోట్ల షేర్‌, రూ.200 కోట్ల గ్రాస్‌ వసూలైంది.

sarkari vari pata
సర్కారువారి పాట

Major movie: ప్రతి భారతీయుడ్ని భావోద్వేగానికి గురిచేసేలా రూపుదిద్దుకున్న చిత్రం 'మేజర్‌'. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని 'హృదయమా' వీడియో సాంగ్​ను విడుదల చేసింది చిత్ర బృందం. ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాను మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా సిద్ధమైంది. వాస్తవిక ఘటనలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే దేశంలోని పలు నగరాల్లో ఈ సినిమాను ముందుగానే ప్రదర్శించనున్నారు. దిల్లీ, జయపుర, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌, ముంబయి, పుణె, హైదరాబాద్‌, బెంగళూరు, కొచ్చిన్‌ అలా దేశంలోని 9 నగరాల్లో.. ఎంపిక చేసిన థియేటర్లలోనే ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: బాలయ్య సినిమాలో యాక్షన్​ కొత్త యాంగిల్​లో..: అనిల్​ రావిపూడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.