ETV Bharat / entertainment

దర్శకేంద్రుడి తనయుడితో జక్కన్న సినిమా.. ఎందుకు మిస్ అయ్యిందంటే?

author img

By

Published : Jul 18, 2023, 12:06 PM IST

Rajamouli
దర్శకేంద్రుడి తనయుడితో రాజమౌళి సినిమా.. ఎందుకు మిస్ అయ్యిందంటే?

Raghavendra rao and rajamouli : తనకు దర్శకత్వ పాఠాలు నేర్పిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడిని రాజమౌళి డైరెక్ట్​ చేయాలని భావించారట. కానీ అది కుదరలేదట. ఆ వివరాలు..

Raghavendra rao and rajamouli : దర్శకధీరుడు రాజమౌళి గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి పెంచడంతో పాటు తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నారు. టాలీవుడ్​కు బ్రాండ్‌ అంబాసిడర్​గా మారిపోయారు. అయితే జక్కన్న డైరెక్షన్​లో నటించాలని ప్రతి నటుడూ ఆశిస్తారు. అవకాశమొస్తే కథ కూడా వినకుండా ఓకే చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మరి అంతటి గొప్ప దర్శకుడైన రాజమౌళి.. దర్శకత్వ పాఠాలు నేర్చుకుంది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర. దీంతో కెరీర్​ ప్రారంభంలో జక్కన్నకు ఓ మంచి అవకాశం దక్కింది. ఏంటంటే.. తన గురువైన రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్‌ కోవెలమూడిని డైరెక్ట్‌ చేసే ఛాన్స్​. కానీ అది ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల మిస్సైంది.

ఎలా అంటే.. జూనియర్​ ఎన్టీఆర్‌ హీరోగా 'స్టూడెంట్‌ నెం.1' చిత్రాన్ని తన తొలి సినిమాగా చేశారు రాజమౌళి. ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద గ్రాండ్ సక్సెస్​ను అందుకుంది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో ప్రకాశ్‌ కోవెలమూడి హీరోగా ఓ సినిమా చేయాలని గ్రాండ్​గా ప్లాన్​ చేశారు. దీనికి సంబంధించి స్టోరీ డిస్కషన్స్​ కూడా జరిగాయట. ఈ చిత్రానికి 'విజయ సింహ' అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. అదితి అగర్వాల్‌ను హీరోయిన్​గా సెలెక్ట్ చేశారు. దాదాపు నాలుగు నెలల పాటు.. స్క్రిప్ట్‌ వర్క్​ కూడా చేశారు. కానీ ఏమైందో తెలీదు కానీ ఆ సినిమా ఆగిపోయింది. చిత్రం సెట్స్​పైకి వెళ్లలేదు. దీంతో సినిమా మధ్యలో ఆగిపోవడంతో.. ప్రకాశ్​ మరో డైరెక్టర్​ చేతిపై నుంచి లాంఛ్ అయ్యారు. జాన్‌ మహేంద్రన్‌ దర్శకత్వంలో 'నీతో' చిత్రం ద్వారా హీరోగా సిల్వర్​ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో దర్శకుడు రాజమౌళి 'సింహాద్రి' అనే చిత్రం తెరకెక్కించి మరో బ్లాక్​బాస్టర్​ హిట్​ను అందుకున్నారు.

మళ్లీ కలిసి పనిచేయలేదు.. ఆ తర్వాత మళ్లీ రాజమౌళి- ప్రకాశ్‌ వేర్వేరు కలిసి పని చేసే అవకాశం కూడా రాలేదు. ఇద్దరు వేరు వేరు దారుల్లో తమ కెరీర్​ను ముందుకు తీసుకెళ్లారు. అయితే నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ప్రకాశ్‌.. కొంతకాలానికి డైరెక్టర్​గా మారారు. 'బొమ్మలాట', 'అనగనగా ఓ ధీరుడు', 'సైజ్‌ జీరో' సహా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2019లో బాలీవుడ్ భామ కంగనా రనౌత్‌తో కలిసి 'జడ్జిమెంటల్‌ హై క్యా' అనే చిత్రాన్ని తీశారు.

ఇదీ చూడండి :

జక్కన్న ఆస్కార్ రేంజ్​కు ఎదగడానికి కారణం.. ఆ ఒక్క ప్రశ్నే!

పది భాగాలుగా రాజమౌళి డ్రీమ్​ ప్రాజెక్ట్​ 'మహాభారతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.