ETV Bharat / entertainment

'ఆదిపురుష్'​ హనుమాన్​ వచ్చేశాడు.. 'ఉస్తాద్‌' ఊచకోత..

author img

By

Published : Apr 6, 2023, 9:11 AM IST

Updated : Apr 6, 2023, 9:42 AM IST

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో పవన్​ కల్యాణ్​ ఉస్తాద్​ భగత్ సింగ్​, ప్రభాస్ ఆదిపురుష్​ సినిమా సంగతులు ఉన్నాయి. అవి మీకోసం..

Pawankalyan ustaad
'ఆదిపురుష్'​ హనుమాన్​ వచ్చేశాడు.. 'ఉస్తాద్‌' ఊచకోత..

'గబ్బర్‌సింగ్‌' తర్వాత పవర్​స్టార్​ పవన్‌కల్యాణ్‌ - దర్శకుడు హరీశ్​ శంకర్‌ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌'. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్​పై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌కు హీరోయిన్​గా శ్రీలీల నటిస్తున్నారు. గత డిసెంబరులోనే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం.. తాజాగా షూటింగ్​ ప్రారంభించుకుంది. ఆర్ట్​ డైరెక్టర్​ ఆనంద్‌ సాయి ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన పోలీస్‌ స్టేషన్‌ సెట్​లో షూటింగ్ షురూ అయింది. ఈ షెడ్యూల్‌లోనే పవన్‌కల్యాణ్‌తోపాటు, ఇతర ప్రధాన తారాగణంపై సీన్స్​ను తెరకెక్కిస్తున్నారు. దిల్లీ నుంచి ఇటీవలే హైదరాబాద్‌కు చేరుకున్న పవన్‌కల్యాణ్‌.. బుధవారం నుంచే ఈ సెట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఉస్తాద్‌ ఊచకోత షురూ అంటూ ఓ స్పెషల్​ పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీటీమ్​. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Pawankalyan ustaad
'ఉస్తాద్‌' ఊచకోత..

హనుమాన్​ పోస్టర్​.. హనుమాన్​ జయంతిని పురస్కరించుకుని పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ నటించిన​ 'ఆదిపురుష్'​ టీమ్​ ఓ కొత్త పోస్టర్​ను రిలీజ్​ చేసింది. అందులో హనుమాన్ పాత్రధారుడు రాముని జపిస్తూ ధ్యానంలో కనిపించారు. ఇక ఆయన వెనుకల రామునిగా ప్రభాస్ కనిపిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Pawankalyan ustaad
'ఆదిపురుష్'​ హనుమాన్​ వచ్చేశాడు

సమంత శాకుంతలం.. ఇక ఏప్రిల్​ 5న హీరోయిన్​ సమంత నటించిన శాకుంతలం సినిమా రిలీజ్​ ట్రైలర్​ కూడా విడుదలై ఆకట్టుకుంది. 'లేడి కన్నులు.. నెమలి నడక.. సివంగి నడుము...' అంటూ హీరో దేవ్‌ మోహన్‌ చెప్పే డైలాగ్‌తో ఈ ప్రచార చిత్రం ప్రారంభమైంది. కాగా, సామ్​ టైటిల్‌ రోల్​లో నటించిన ఈ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 14న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా రిలీజ్‌ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రజనీకాంత్​-లోకేశ్​ కాంబో.. సూపర్​ స్టార్​ రజనీకాంత్‌ ప్రస్తుతం ఫుల్​ జోరుగా ఉన్నారు. వరుస సినిమాలను కమిట్​ అవుతూ.. షూటింగ్​లను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే 'జైలర్‌' చిత్రంలో కథనాయకుడిగా, 'లాల్‌సలామ్‌' మూవీలో అతిథి పాత్రలో నటిస్తున్న ఆయన.. రీసెంట్​గా 'జై భీమ్‌' దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో ఓ సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరో సినిమాకు సైన్​ చేయడానికి సిద్ధమవుతున్నారట. ఇటీవలే కమల్​హాసన్ 'విక్రమ్​' సినిమాతో ఫుల్ జోష్​లో ఉన్న దర్శకుడు లోకేశ్​ కనగరాజ్‌... రజనీకాంత్‌ను కలిసి ఓ కథ వినిపించారని, అది రజనీకాంత్‌కు నచ్చిందని టాక్‌ వినిపిస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రాన్ని కమల్‌హాసన్‌ నిర్మించబోతున్నారని సమాచారం అందుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

rajnikanth lokesh kanagaraj
రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్​

ఇదీ చూడండి: హీరో రాజశేఖర్ లవ్​ స్టోరీ.. 'పెళ్లి చేసుకోకపోయినా ఆమె నాతోనే ఉంటానంది'

Last Updated : Apr 6, 2023, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.