అతడు, ఖలేజా సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేశ్బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న సినిమా SSMB28. ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సంక్రాంతి రోజే ప్రకటించింది. తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
రూ.80 కోట్లకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుందంటున్నారు. మహేశ్తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు కూడా ఇది తొలి పాన్ ఇండియా సినిమా అవ్వడంతో నెట్ఫ్లిక్స్ ఇంత భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కానీ ఈ విషయం తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని ఈ ఏడాదే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది.
ఇక మహేశ్ బాబు ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వంచర్లో నటించనున్నారు. ఈ చిత్రం సీసీఏ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ తో ఒప్పందం చేసుకున్నట్లు జక్కన్న తెలిపారు. పదేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్గా రూపొందనుందని వెల్లడించారు.
ఇదీ చూడండి: 'దళపతి 67'లో కేజీయఫ్ విలన్.. హీరోయిన్గా త్రిష ఫిక్స్