వెయ్యి కోట్ల క్లబ్​లో టాలీవుడ్​, శాండల్​ వుడ్​.. కోలీవుడ్ ఆశలన్నీ ఆ సినిమాపైనే?

author img

By

Published : Mar 18, 2023, 8:09 PM IST

Ponniyan selvan 2
Ponniyan selvan 2 ()

టాలీవుడ్​, శాండల్​వుడ్​, బాలీవుడ్​.. ఇండస్ట్రీలన్నీ రీసెంట్​గా తమకు చెందిన ఒక్కో సినిమాతో రూ.1000 కోట్ల వసూళ్లను అందుకున్నాయి. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఇంత వరకు అంతటి వసూళ్లను సాధించిన సినిమా రాలేదు. దీంతో ఆ ఇండస్ట్రీ వారు త్వరలోనే రిలీజ్ కానున్న 'పొన్నియన్​ సెల్వన్​ 2'పైనే ఆశలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

గత కొంతకాలంగా భారత చలన చిత్రసీమలో ఎన్నో మార్పులు వచ్చాయి. భాషతో సంబంధం లేకుండా చిత్రాలన్నీ పాన్​ ఇండియా స్థాయిలో తెరకెక్కుతూ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు సినిమాను.. ఎన్ని రోజులు ఆడిందన్న విషయాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు బాక్సాఫీస్​ కలెక్షన్లను చూస్తున్నారు. ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టిందని లెక్కలేస్తున్నారు. అయితే కలెక్షన్ల విషయంలో ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్​దే​ ఎప్పుడూపై చేయి ఉండేది. వంద కోట్ల నుంచి వెయ్యి కోట్ల సినిమా అంటే.. అది హిందీ చిత్రమే అయి ఉండేది. అమీర్ ఖాన్​ 'దంగల్'​ అయితే ఏకంగా రూ.​ 2000 కోట్లను వసూలు చేసి ఇండియన్​ బాక్సాఫీస్​ను షేక్ చేసింది. కానీ ఇప్పుడు అంతా మారింది.

ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చేశాయి. ఒక్కప్పుడు ఇక్కడ తమిళ, తెలుగు చిత్రసీమల మధ్యే పోటీ ఉండేది. అయితే 'బాహుబలి' సిరీస్​, 'ఆర్ఆర్​ఆర్'తో టాలీవుడ్ ఖ్యాతి అటు ఇండియాతో పాటు వరల్డ్​వైడ్​గా పెరిగిపోయింది. ఈ రెండు చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్​ను అందుకున్నాయి. ఆ తర్వాత ఎవరికీ అంతగా తెలియని కన్నడ సినీ పరిశ్రమ కూడా 'కేజీయఫ్​' సిరీస్​, 'కాంతార' వంటి చిత్రాలూ సూపర్​ హిట్​ను అందుకుని.. దేశవ్యాప్తంగా అందరిని తమ ఇండస్ట్రీ వైపుకు చూసేలా చేశాయి. 'కేజీఎఫ్​ 2' సుమారు 1148 కోట్లను వసూలు చేసింది. కాంతారా కూడా రూ. 15 కోట్ల బడ్జెట్​తో రూపొందింది రూ.500కోట్ల వరకు వసూళ్లను అందుకుంది. అలా తెలుగు, కన్నడ సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్​లోకి చేరాయి. అలా సౌత్​ సినిమా దెబ్బకు నార్త్ సినిమా గ్రాఫ్​ గత కొద్ది కాలంగా పడింది. కానీ రీసెంట్​గా రిలీజైనా షారుక్​ పఠాన్​తో మళ్లీ తిరిగి పుంజుకుంది. అది కూడా రూ. 1000 కోట్ల మార్క్​ అందుకుంది. అయితే కోలీవుడ్​లో మాత్రం ఇంతవరకు వెయ్యి కోట్లు కలెక్షన్లను అందుకున్న సినిమా ఏది ఇంతవరకు రాలేదు.

తమిళంలో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రజనీకాంత్​ నటించిన '2.0'. బాక్సాఫీస్​ వద్ద కమర్షియల్​ హిట్​ సాధించినప్పటికీ ఈ సినిమా వంద కోట్ల మార్క్​ను దాటలేకపోయింది. కేవలం 650 కోట్లతో సరిపెట్టుకుంది. అయితే రీసెంట్​గా రిలీజైన 'పొన్నియిన్ సెల్వన్ పార్ట్​ 1' ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా సీక్వెల్​పై కొండంత ఆశలు పెట్టుకున్నారు తమిళ అభిమానులు. ఇప్పటికే పీఎస్​ 1ను సినీ ప్రియులు ఎంతగానో ఆదరించగా.. ఇప్పుడు దీని రెండో భాగాన్ని కూడా అంతే ఆదరిస్తారని మేకర్స్​ ఆశిస్తున్నారు. మరీ ఈ సినిమాతో అన్న తమిళ ఇండస్ట్రీ రూ.1000 కోట్ల మార్క్​ను దాటుతుందో లేదో లేక ఆ రికార్డును బ్రేక్​ చేసి దూసుకెళ్తుందో చూడాలి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పొన్నియిన్ సెల్వన్ 2' ఈ ఏడాది ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది. చియాన్​ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి లాంటి స్టార్స్​ ఈ సినిమాలో ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.