ETV Bharat / entertainment

'ఆదిపురుష్​పై నిషేధం'.. హీరో ప్రభాస్​కు దిల్లీ కోర్టు నోటీసులు

author img

By

Published : Oct 10, 2022, 5:25 PM IST

ఆదిపురుష్​ మూవీ టీమ్​కు దిల్లీ కోర్టు షాకిచ్చింది. మూవీ హీరో ప్రభాస్​తో పాటు మొత్తం చిత్రయూనిట్​కు నోటీసులు జారీ చేసింది.

Delhi high court sends notice to prabhas
హీరో ప్రభాస్​కు దిల్లీ హైకోర్టు నోటీసులు

పాన్​ఇండియా స్టార్​ ప్ర‌భాస్‌కు దిల్లీ కోర్టు సోమ‌వారం నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న 'ఆదిపురుష్' సినిమాలో రాముడి పాత్ర‌లో ప్రభాస్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజ్ కాగా... ప‌లు వ‌ర్గాలు అభ్యంత‌రం వ్యక్తం చేశాయి.

ఈ క్ర‌మంలోనే 'ఆదిపురుష్' మూవీటీమ్​​.. హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బతీసిందంటూ ఓ సంస్థ దిల్లీ కోర్టును ఆశ్ర‌యించింది. అంతేకాకుండా 'ఆదిపురుష్' సినిమా విడుద‌ల‌పై స్టే విధించాల‌ని కూడా కోరింది. తాజాగా ఈ పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టిన దిల్లీ కోర్టు హీరో ప్ర‌భాస్‌తో పాటు 'ఆదిపురుష్' మూవీటీమ్​కు సైతం నోటీసులు జారీ చేసింది.

కాగా, గత కొద్ది రోజులుగా ఆదిపురుష్‌ టీజర్‌పై విపరీతంగా ట్రోల్స్‌ వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన ఈ మూవీ గురించే చర్చ జరుగుతోంది. యానిమేటెడ్‌ చిత్రంలా ఉందని ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో రాముడు, రావణుడు, హనుమంతుడు పాత్రలను చూపించిన విధానం సరైందని కాదని.. పలు సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. రామాయణం గురించి అధ్యయనం చేయకుండానే ఓంరౌత్‌ ఆదిపురుష్‌ తెరకెక్కించారంటూ ఆయనపై రాజకీయ నేతలు కోప్పడ్డారు. ఈ మూవీలో హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీశారని, వెంటనే ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయలనే వాదనలు వినిపించాయి.

ఇదీ చూడండి: బాలయ్య అన్​స్టాపబుల్​లో గెస్ట్‌గా చంద్రబాబు.. వచ్చేది ఆరోజే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.