ETV Bharat / entertainment

మెగాస్టార్ ఫామ్​హౌజ్ గురించి నెట్టింట చర్చ- ఖరీదెంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 7:30 PM IST

Updated : Jan 17, 2024, 9:16 PM IST

Chiranjeevi Farm House Bangalore
Chiranjeevi Farm House Bangalore

Chiranjeevi Farm House Bangalore: మెగాస్టార్ ఫ్యామిలీ కర్ణాటకలోని చిరు ఫామ్​హౌజ్​లో సంక్రాంతి సంబరాలు జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో చిరు ఫామ్​హౌజ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

Chiranjeevi Farm House Bangalore: మెగాస్టార్ ఫ్యామిలీ 2024 సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంది. బెంగళూరులోని ఫామ్​హౌజ్​లో జరిగిన ఈ వేడుకలో చిరంజీవి- అల్లు అరవింద్‌ కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. ఇక తాజాగా వీరంతా తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. షెడ్యుల్ ప్రకారం ఎవరి పనిలో వారు బిజీగా ఉండనున్నారు. అయితే మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఓ విషయం నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది.

మెగాఫ్యామిలీ సంక్రాంతి వేడుక చేసుకున్న ఫామ్​హౌజ్ గురించి నెటిజన్లు గూగుల్​లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఫామ్​హౌజ్ ఎక్కడ ఉంది? దాని ఖరీదు ఎంత ఉంటుంది? అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చిరంజీవికి చెందిన ఈ ఫామ్​హౌజ్ బెంగళూరుకు దాదాపు 35 కీమీ దూరంలో ఉన్న దేవనహళ్లిలో ఉంది. ఇక్కడ్నుంచి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు చాలా దగ్గర్లో ఉంటుందట. ఇక ఈ ఫామ్​హౌజ్ ఖరీదు రూ.30 కోట్లు ఉండవచ్చని అంచనా. మెగాఫ్యామిలీకి సంబంధించిన ఏ పార్టీయైనా, వేడుకైనా ఇక్కడే జరుపుకుంటారు.

చిరు, నాగబాబు విషెస్: సంక్రాంతి పండగ వేళ మెగాబ్రదర్స్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్​ విషెస్ తెలిపారు. మొదట చిరంజీవి గ్రూప్ ఫొటో షేర్ చేస్తూ 'పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!' అని రాసుకొచ్చారు. ఇక తాజాగా నాగబాబు, అన్నయ్య చిరుతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోకు 'పండుగలు కుటుంబాల మధ్య మనుషుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయి, నా హృదయానికి అత్యంత దగ్గరైన మనషుల సమక్షంలో ఈ పండుగను జరుపుకోవడం చెప్పలేనంత ఆనందాన్ని నింపింది. ఇది నా జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచి ఉంటుంది' అనే క్యాప్షన్​ను జోడించారు.

ఇక సినిమాల విషయానికొస్తే: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర', అల్లు అర్జున్ 'పుష్ప-2'​, రామ్​ చరణ్ 'గేమ్ ఛేంజర్' షూటింగ్​లు రీ స్టార్ట్ చేయనున్నారు. మరోవైపు వరున్​తేజ్ బుధవారం (జనవరి 17) పంజాబ్​ అమృసర్​ గోల్డెన్​ టెంపుల్​ను సందర్శించారు.

'హనుమాన్'​- నెక్ట్స్​ చిరంజీవి, నిఖిల్ కూడా ఇదే బాటలో!

ఫొటో మూమెంట్​ - మెగా వారసులతో చిరు సెల్ఫీ

Last Updated :Jan 17, 2024, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.