ETV Bharat / crime

Young Man Killed in Hyderabad : పెళ్లైన మూణ్నెళ్లకే యువకుని హత్య.. చేసిందెవరంటే?

author img

By

Published : Oct 2, 2021, 10:23 AM IST

Young Man Killed in Hyderabad
Young Man Killed in Hyderabad

పాతకక్షలతో ఓ యువకుని(Young Man Murder in Hyderabad)పై కత్తులతో దాడి చేసిన ఘటన హైదరాబాద్​ ఫలక్​నుమా పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుణ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.

హైదరాబాద్ ఫలక్​నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి మహబూబ్​ అలియాస్ అబ్బాస్ (24) అనే యువకునిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి(Young Man Murder in Hyderabad) చేశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుణ్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మూణ్నెళ్ల క్రితం ఫలక్​నుమా పీఎస్​ పరిధికి చెందిన ఓ యువతితో అబ్బాస్​ వివాహం జరిగింది. అతడు స్థానికంగా ఎలక్ట్రీషియన్​గా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో భోజనం చేసిన అబ్బాస్ ఏదో పని మీద బయటకు వెళ్లాడు. ఇంటి నుంచే అతణ్ని ఫాలో అయిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముస్తఫానగర్​లోని ఓ కిరాణా దుకాణం వద్ద అతడిపై కత్తులతో దాడి(Young Man Murder in Hyderabad) చేశాడు.

"నా బేటా.. భోజనం చేసి బయటకు వెళ్లాడు. తను బయటకు వెళ్లిన కాసేపటికే పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది నా కొడుకును ఎవరో కత్తులతో పొడిచారని. నా కుమారునికి ఎవరితో గొడవల్లేవు. పెళ్లై మూడు నెలలే అయింది. ఎవరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారో. వారిని తప్పకుండా కఠినంగా శిక్షించాలి."

- మృతుడి తల్లి

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అబ్బాస్​ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. హత్య జరిగిన ప్రాంతాన్ని దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ పరిశీలించారు. అబ్బాస్ హత్య(Young Man Murder in Hyderabad)కు పాత కక్షలే కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న ఫలక్​నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.