ETV Bharat / crime

విషాదం: ఏనుగు దాడిలో యువరైతు మృతి

author img

By

Published : Apr 14, 2021, 11:54 AM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులోని కాలవపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. పొలం పనుల నిమిత్తం ఓ యువరైతు.. అర్థరాత్రి పొలానికి వెళ్లగా అక్కడ సంచరిస్తున్న ఏనుగు అతనిపై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన రైతు అక్కడికక్కడే మృతిచెందాడు.

young-farmer-died-in-elephant-attack-at-kalavapalli-in-chittoor
విషాదం: ఏనుగు దాడిలో యువరైతు మృతి

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కాలవపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు జానికిరామ్(25) పొలానికి నీరు పెట్టేందుకు.. అర్థరాత్రి పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ సంచరిస్తున్న ఓ ఏనుగు.. అతనిపై దాడి చేసింది.

విషాదం: ఏనుగు దాడిలో యువరైతు మృతి

యువకుడు గట్టిగా కేకలు వేయటంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ జానకిరామ్​.. పొలంలోనే ప్రాణాలు వదిలాడు. జానకిరామ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికందొచ్చిన కుమారుని మృతితో.. అతని తల్లి రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

ఇదీ చదవండి: అకాలవర్షం.. చేతికందిన ధాన్యం నీటి పాలు

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కాలవపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు జానికిరామ్(25) పొలానికి నీరు పెట్టేందుకు.. అర్థరాత్రి పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ సంచరిస్తున్న ఓ ఏనుగు.. అతనిపై దాడి చేసింది.

విషాదం: ఏనుగు దాడిలో యువరైతు మృతి

యువకుడు గట్టిగా కేకలు వేయటంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ జానకిరామ్​.. పొలంలోనే ప్రాణాలు వదిలాడు. జానకిరామ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికందొచ్చిన కుమారుని మృతితో.. అతని తల్లి రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

ఇదీ చదవండి: అకాలవర్షం.. చేతికందిన ధాన్యం నీటి పాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.