ETV Bharat / crime

నిర్లక్ష్యానికి బాలింత మృతి..!, పరారైన ప్రైవేట్ డాక్టర్

author img

By

Published : May 6, 2021, 7:15 PM IST

ఓ ప్రైవేట్ వైద్యుడి నిర్లక్ష్యంగా వల్ల నిండు ప్రాణాలు పోయాయి. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. ప్రసవం కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేస్తుండగా తీవ్ర రక్తస్రావానికి గురై మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన సంఘటనతో వైద్యుడు, ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని వదిలి పారిపోయారు.

women died in aleru
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బాలింత మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ డాక్టర్ నిర్లక్ష్యానికి బాలింత ప్రాణాలు కోల్పోయింది. ఆలేరు మండలం గొలనుకొండ గ్రామానికి చెందిన రొయ్యల ఉషా(22) ప్రసవం కోసం గురువారం సుధా నర్సింగ్ హోమ్ కి వచ్చింది. గర్భిణీ మహిళకు ఆపరేషన్‌ చేస్తుండగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అదేక్రమంలో తీవ్ర రక్తస్రావమై ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో వైద్యుడు ప్రతాప్ రెడ్డి, ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని వదిలి పారిపోయారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మరణించిందంటూ భర్త క్రాంతి, మామ నర్సింగరావు, బంధువులు ఆరోపిస్తున్నారు.

గొలనుకొండ గ్రామానికి చెందిన రొయ్యల ఉషా(22) ఈనెల 3న ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా స్కానింగ్ చేశారు. ఈ నెల 7 వతేదీ శుక్రవారం డెలివరీ చేస్తామని చెప్పారు. మళ్లీ బుధవారం రాత్రి నొప్పులు రాగా ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. విధుల్లో ఉన్న నర్సులు తాత్కాలికంగా సేవలందించారు.

గురువారం ఉదయం 10 గంటల సమయంలో మహిళకు నొప్పులు తీవ్రం కావడం, గర్భస్థ శిశువు ఉమ్మనీరు మింగుతుందని నర్సులు చెప్పడంతో స్థానిక సుధా నర్సింగ్ హోమ్ వైద్యుడు ప్రతాప్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసే క్రమంలో మగ పిల్లాడు జన్మించగా.. తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లి మరణించింది. వైద్యుడు ప్రతాప్ రెడ్డి స్థానిక పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.

ఇదీ చూడండి: ఆస్పత్రుల నిర్లక్ష్యం... ప్రాణవాయువు లేదని చేతులెత్తేస్తున్నారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.