ETV Bharat / crime

భర్త ఇంటికి పంపిన మరుసటి రోజే భార్య అనుమానస్పద మృతి!

author img

By

Published : Feb 6, 2021, 8:21 AM IST

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. భర్త వేధింపులే కారణమని మృతురాలి తల్లి ఆరోపించారు. గొంతు కింద కమిలిన గుర్తులున్నాయని... విచారణ చేపట్టి అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

woman-suspected-death-at-td-gutta-in-mahabubnagar-district
భర్త ఇంటికి పంపిన మరుసటి రోజే భార్య అనుమానస్పద మృతి!

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వివాహిత అనుమానస్పదంగా మృతి చెందింది. పట్టణంలోని టీడీ గుట్ట ప్రాంతానికి చెందిన తిరుపతమ్మ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తిరుపతమ్మకు, టీడీ గుట్టకు చెందిన యాదయ్యకు పదేళ్ల కిందట వివాహం జరిపించామని మృతురాలి తల్లి తెలిపారు. అనుమానంతో యాదయ్య వేధింపులకు గురి చేసేవాడని ఆరోపించారు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి నచ్చ జెప్పామని.. గురువారం నాడు యాదయ్య ఇంటికి తమ కూతురిని పంపామన్నారు. శుక్రవారం ఉదయానికి మృతి చెందిందన్నారు.

గొంతు కింద కమిలిన గుర్తులు ఉన్నాయని... తన కూతురు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. శపపరీక్ష కోసం మృతదేహాన్ని జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ఖమ్మం హత్యోదంతంలో కొత్త ట్విస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.