ETV Bharat / crime

నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్య కేసులో ముగ్గురు అరెస్టు

author img

By

Published : Jan 13, 2022, 5:12 PM IST

Updated : Jan 13, 2022, 6:53 PM IST

Nizamabad Family Suicide Case
Nizamabad Family Suicide Case

17:10 January 13

నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్య కేసులో ముగ్గురు అరెస్టు

ఆత్మహత్యకు ముందు సురేష్​ కుటుంబం సీసీటీవీ వీడియో

వడ్డీ వ్యాపారుల వేధింపులతో విజయవాడలో నిజామాబాద్​కు చెందిన సురేష్​ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో ముగ్గురు అరెస్ట్​ అయ్యారు. జ్ఞానేశ్వర్, చంద్రశేఖర్, వినీతలను విజయవాడ పోలీసులు అరెస్ట్​ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. పప్పుల సురేష్ కుటుంబం.. ఆత్మహత్యకు ముందు తీవ్ర ఒత్తిడికి గురైందని పోలీసులు చెప్పారు. సీసీటీవీ దృశ్యాల ద్వారా దీన్ని గుర్తించినట్లు తెలిపారు. వసతి గృహం లోపల చనిపోయిన భార్య శ్రీలత, ఆశీష్​లను గదిలో వదిలి వెళ్లి.. సురేష్, అతని కుమారుడు అఖిల్ నదిలో దూకి సూసైడ్ చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లే ముందు వారున్న గదిలోకి, బయటకు రెండు సార్లు తిరిగినట్లు సీసీటీవీల్లో రికార్డు అయింది.

ఈనెల 8న సూసైడ్​..

ఏపీలోని విజయవాడలో.. నిజామాబాద్​కు చెందిన సురేష్​ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణానదిలో దూకారు. విజయవాడ వన్​టౌన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో బ్రాహ్మణ విధిలో శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రంలోని 3వ ఫ్లోర్‌లో ఈనెల 6వ తేదీన వీరు.. పప్పుల అఖిల్ పేరిట వీరు ఒక గది తీసుకున్నారు. ఈనెల 8న ఉదయం 6 గంటలకు నిజామాబాద్ నుంచి శ్రీ రామప్రసాద్ అనే వ్యక్తి సత్రానికి ఫోన్​ చేసి తన బావ సురేశ్‌ అప్పుల బాధతో చనిపోతున్నట్లు సమాచారం అందించారు. రాత్రి రెండున్నర గంటలకు తన బావ వద్ద నుంచి ఈ మేరకు వాయిస్‌ మెసెజ్‌లు వచ్చాయని తెలిపాడు. దీంతో సత్రం సిబ్బంది సురేశ్‌ కుటుంబం ఉన్న గదికి వెళ్లి చూడగా... అప్పటికే ఇద్దరు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులు పప్పుల సురేష్‌(56), పప్పుల శ్రీలత కాగా...వారి కుమారులు 28 ఏళ్ల అఖిల్‌, 22 ఏళ్ల ఆశిష్‌గా గుర్తించారు.

సెల్ఫీ వీడియో వైరల్​..

అనంతరం ఆత్మహత్యకు కారణాలను వెల్లడిస్తూ ఓ సెల్ఫీ వీడియో బహిర్గతమైంది. ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని పేర్కొన్న పప్పుల సురేశ్‌.. సెల్ఫీ వీడియో విడుదలైంది. వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధిక వడ్డీల కోసం జ్ఞానేశ్వర్‌ అనే వ్యక్తి ఒత్తిడి తెచ్చాడన్న సురేశ్‌... జ్ఞానేశ్వర్‌కు రూ.40 లక్షలకు పైగా వడ్డీలు చెల్లించానన్న ఆ వీడియోలో వెల్లడించారు. వడ్డీలు చెల్లించినా ఇల్లు జప్తు చేస్తానని బెదిరించినట్లు తెలిపారు. ప్రామిసరీ నోట్లపై భార్య, పిల్లల సంతకం చేయించుకున్నారని... అధిక వడ్డీల కోసం గణేశ్‌ కూడా తీవ్ర ఒత్తిడి తెచ్చాడని సురేశ్‌ వీడియోలో పేర్కొన్నారు. గణేశ్‌కు రూ.80 లక్షల వరకు చెల్లించినట్లు వాపోయారు.

306 సెక్షన్​ కింద కేసు..

సురేశ్​ రాసిన మరణ వాంగ్మూలం, సెల్ఫీ వీడియో ఆధారంగా నిర్మల్​కు చెందిన వినీత, చంద్రశేఖర్, నిజామాబాద్‌కు చెందిన జ్ఞానేశ్వర్, గణేశ్‌లపై 306 సెక్షన్ కింద విజయవాడ పోలీసులు కేసునమోదు చేశారు. విజయవాడ ఒకటో పట్టణ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిజామాబాద్‌కు వచ్చిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. నగరంలోని గంగాస్థాన్ ఫేజ్-2లోని శ్రీచైతన్య అపార్ట్మెంట్‌లో సురేశ్​ కుటుంబం నివాసముండే 207 నంబర్ గల ఇంటిని పరిశీలించారు. అక్కడున్న ఆపార్ట్మెంట్ సిబ్బందిని, అందులో నివాసముండే వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత కథనాలు..

Last Updated :Jan 13, 2022, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.