ETV Bharat / crime

ట్రాక్టర్​ బోల్తా.. బాలుడు మృతి

author img

By

Published : Apr 28, 2021, 10:47 PM IST

పొలం నుంచి ధాన్యం తరలిస్తోన్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ ట్రాక్టర్​ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో జరిగిందీ ఘటన.

tractor overturns
tractor overturns

ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్​ తీవ్రంగా గాయపడ్డాడు.

కన్నారెడ్డి కుంట తండాకు చెందిన లకావత్ దేవరాజ్.. పొలం నుంచి ధాన్యం తరలిస్తోన్న సమయంలో అదుపుతప్పి ట్రాక్టర్​ బోల్తా పడింది. వాహనం పైనుంచి కింద పడ్డ బాలుడు అభిరామ్​.. తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు దేవరాజ్​ను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: 'లైంగిక వాంఛ తీర్చలేదని వృద్ధురాలిని నరికి చంపాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.