పొలంలో ఉన్న రైతును ఈడ్చుకెళ్లి చంపిన పెద్దపులి..!

author img

By

Published : Nov 15, 2022, 10:34 PM IST

Tiger

Tiger killed a farmer: పెద్దపులి దాడితో రైతు మరణించిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. వాంకిడి మండలం ఖానాపూర్​ గ్రామానికి చెందిన సీడాం భీమ్​(69) అనే వ్యక్తి పత్తి చేనులో పత్తి తీసేందుకు వెళ్లగా.. పులి అకస్మాత్తుగా అతడిపై దాడికి పాల్పడి, కొండ ప్రాంతం నుంచి దిగువకు ఈడ్చుకెళ్లింది. దానితో భీమ్​ అక్కడికక్కడే మరణించాడు.

Tiger killed a farmer: పెద్దపులి దాడితో రైతు మరణించిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. వాంకిడి మండలం ఖానాపూర్​ గ్రామానికి చెందిన సీడాం భీమ్​(69) అనే వ్యక్తి పత్తి చేనులో పత్తి తీసేందుకు వెళ్లగా.. పులి అకస్మాత్తుగా అతడిపై దాడికి పాల్పడి, కొండ ప్రాంతం నుంచి దిగువకు ఈడ్చుకెళ్లింది. దానితో భీమ్​ అక్కడికక్కడే మరణించాడు. అదే పులి ఉదయం పూట పశువులు కాస్తున్న కాపరులకు కనిపించిందని వారు పెద్దగా కేకలు వేయడంతో అక్కడ నుంచి వెళ్లిపోయిందని స్థానికులు తెలియజేశారు.

ఆ సమయంలో ఫారెస్ట్ అధికారులు కూడా అదే ప్రాంతం చుట్టూ పక్కల పోడు భూముల సర్వే నిర్వహిస్తుండటంతో ఈ విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పులి దాడిలో మరణించిన భీమ్​ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారాన్ని వచ్చేలా చూస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.