ETV Bharat / crime

Three died: ఒకే రోజు.. ఒకే రైలు.. ముగ్గురు మృతి..

author img

By

Published : Mar 12, 2022, 10:15 PM IST

three were dead  in train-accident-in-west-godavari
three were dead in train-accident-in-west-godavari

Three died: ఒకే రోజు ఒకే రైలు కింద పడి ముగ్గురు చనిపోయారు. అందులో ఇద్దరు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒకరు మాత్రం ప్రమాదవశాత్తు రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనలు.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

Three died: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు-భీమడోలు మధ్య వెళ్తున్న రైలు కింద పడి ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడగా.. మరొకరు ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయారు.

ఆత్మహత్య చేసుకున్న ఇద్దరిలో.. ఒకరు పిఠాపురానికి చెందిన ఆటోడ్రైవర్ ప్రసాద్ (40)గా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. అతడు బిహార్‌​కు చెందిన మహమ్మద్ హసన్ అన్సారీ (29)గా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.