ETV Bharat / crime

accident: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

author img

By

Published : Aug 2, 2021, 8:37 AM IST

రాంగ్​ రూట్​లో వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

కారు-లారీ ఢీ.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
కారు-లారీ ఢీ.. అక్కడికక్కడే ముగ్గురు మృతి

ఏపీ అనంతపురం జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. అనంతపురం జిల్లాలోని గుత్తి సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్​లో వస్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. బెంగళూరు నుంచి కర్నూలు వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గుల్​బర్గాకు చెందిన లాయక్ అలీ, అష్రఫ్ అలీ, కర్నూలు జిల్లాకు ఖాసిం మహమ్మద్​లు అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న సీఐ రాము హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు స్థానికులు, పోలీసులు శ్రమించారు. మృతదేహాలు కారులో చిక్కుకోవడంతో క్రేన్ల సాయంతో.. బయటకు తీశారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.