ETV Bharat / crime

రెమ్​డెసివిర్‌ ఇంజక్షన్​లతో దందా.. ముగ్గురి అరెస్టు

author img

By

Published : Apr 30, 2021, 5:16 PM IST

కరోనా కారణంగా రెమ్​డెసివిర్‌ ఔషధానికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో రోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో రెమ్​డెసివిర్‌ ఇంజక్షన్​ ఒక్క డోసును 35 వేలకు విక్రయిస్తోన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

Three arrested for selling Remediesiver injections in boduppal
అధిక ధరకు రెమిడెసివర్‌ ఇంజెక్షన్​లను విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

కొవిడ్‌ బాధితులకు అవరసమైన రెమ్​డెసివిర్‌ ఇంజెక్షన్‌లను అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను రాచకొండ ఎస్​ఓటీ, మేడిపల్లి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మూడు డోస్​లతో పాటుగా, మూడు చరవాణులు, 6 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్​లోని ఓ ఔషధ దుకాణంలో ఈ దందా జరుగుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

సికింద్రాబాద్​లోని వారాసిగూడకు చెందిన రామ్‌చందర్‌ లాబ్‌ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. అతని అనుచరులు ఫిర్జాదిగూడకు చెందిన కార్తిక్‌, బోడుప్పల్​ ప్రాంతానికి చెందిన శ్రీనయ్య కలిసి రెమ్​డెసివిర్‌ ఇంజక్షన్‌లను ఒక్క డోసు 35 వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ప్రశ్నించగా ఇంజక్షన్‌ల దందా గురించి బయటపడింది. నిందితులపై కేసు నమోదు చేసిన మేడిపల్లి ​పోలీసులు స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి: కరోనా కాటుకు భార్యాభర్తలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.