ETV Bharat / crime

Bus fell in river: వంతెన పైనుంచి వాగులో పడిన ఆర్టీసీ బస్సు, 9 మంది మృతి

author img

By

Published : Dec 15, 2021, 1:00 PM IST

Updated : Dec 15, 2021, 2:49 PM IST

Bus Accident: వంతెన పైనుంచి వాగులో పడిన ఆర్టీసీ బస్సు, 9 మంది మృతి
Bus Accident: వంతెన పైనుంచి వాగులో పడిన ఆర్టీసీ బస్సు, 9 మంది మృతి

13:13 December 15

వంతెన పైనుంచి వాగులో పడిన ఆర్టీసీ బస్సు

12:56 December 15

వంతెన పైనుంచి వాగులో పడిన ఆర్టీసీ బస్సు

bus
bus

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం పరిధిలో జల్లేరు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో పడింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులోని మిగిలిన ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. వంతెన రెయిలింగ్​ను ఢీకొన్న బస్సు.. ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

బయటకు రాలేకే మృతి

ఘటన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదస్థలిలోనే బస్సు డ్రైవర్‌ మృతి చెందాడు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. మరణించినవారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. నీటిలో పడిన బస్సు నుంచి బయటికి రాలేకే 9 మంది మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.

రంగంలోకి దిగిన స్థానికులు

ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నప్రజలు సహాయక చర్యలకు ముందుకొచ్చారు. మృతిచెందిన వారిని బస్సు కిటికీల నుంచే బయటకు తీశారు. కిటికీల నుంచి కొందరు ప్రయాణికులు బయటకు వచ్చారు. మిగిలిన ప్రయాణికులను స్థానికులు కాపాడారు. ఘటనాస్థలిలో.. ఆర్​డీఓ, డీఎస్పీ ఆధ్వర్యంలో సహాయచర్యలు కొనసాగిస్తున్నారు.

క్షతగాత్రులను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. బస్సులోపలే ఉండిపోయినవారిని.. స్థానికులు పడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఈ బస్సు.. అతివేగంతో రావడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు అంటున్నారు.

ఇదీ చదవండి:

Boy died in Mulugu: నీళ్లు అనుకొని పురుగులమందు తాగి.. బాలుడు మృతి

Last Updated :Dec 15, 2021, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.