ETV Bharat / crime

డీసీఎం వ్యాన్ ​- ఆటో ఢీ.. వృద్ధుడు మృతి

author img

By

Published : Mar 16, 2021, 12:39 PM IST

road accident in sangareddy dcm van auto collision old man killed
డీసీఎం వ్యాన్ ​- ఆటో ఢీ.. వృద్ధుడు మృతి

సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం శివంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాన్.. ఆటోను ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.

వేగంగా వస్తున్న డీసీఎం వ్యాన్.. ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం శివంపేట గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ మరో ముగ్గురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మృతుడు.. మెట్​పల్లి మండలం ఖాదీరాబాద్ గ్రామానికి చెందిన కాంతయ్య (65)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.