ETV Bharat / crime

Road accident: కూలీ పనుల కోసం వెళుతుండగా ఆటోను ఢీకొన్న టిప్పర్... చివరికీ...

author img

By

Published : Feb 24, 2022, 11:48 AM IST

Road accident:రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు వాళ్లవి. తెల్లవారుజామున వెళ్తే సాయంత్రానికి ఇంటికొస్తారు. కూలీ పనుల కోసం వెళుతుండగా వేకువజామున వారు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న టిప్పర్ పక్క నుంచి ఢీకొట్టింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా... ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

Road accident
రోడ్డు ప్రమాదం

Road accident: తెల్లవారుజామున కూలీ పనుల కోసం వెళుతున్న ఆటోను టిప్పర్ పక్క నుంచి ఢీకొట్టింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా... ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఏం జరిగిందంటే...

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఐనవోలు గ్రామ శివారులో పటాన్‌చెరు వైపు వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న టిప్పర్ పక్క నుంచి ఢీకొట్టింది. దీంతో ఏపీఆర్ కాలనీలో పనిచేసేందుకు వస్తున్న సోఫియా బేగం, స్వరూప, ముబీనా, ఆటోడ్రైవర్ షరీఫ్‌ అనే వారికి తీవ్ర గాయాలయ్యాయి. యాదమ్మ, సుహానా అనే ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:Honor Killing in Sangareddy: ప్రేమ పేరుతో పరువు తీస్తోందని.. ప్రియుడితో కలిసి బిడ్డను చంపేసిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.