Live Video: మహిళ పై నుంచి దూసుకెళ్లిన లారీ..

author img

By

Published : Sep 22, 2021, 4:40 PM IST

accident

ఇల్లు దాటి బయటకు వెళ్లామంటే తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్డుపై మనం జాగ్రత్తగా వెళ్లినా ఎదుటి వాడు జాగ్రత్తగా లేకుంటే మన పని అయిపోయినట్లే.. తాజాగా స్కూటీపై దంపతులు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి భార్య మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్​ జిల్లాలో జరిగింది.

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని చెక్ పోస్టు వద్ద లారీ కింద పడి మహిళ మృతి చెందింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానెపల్లికి చెందిన శ్రీనివాస్​, మంజుల (41) ఇద్దరు స్కూటీపై బోయిన్​పల్లికి వెళ్తున్నారు. చెక్ పోస్టు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఓవర్​ టెక్​ చేయబోయింది. ఈ క్రమంలో శ్రీనివాస్​ సడన్​ బ్రెక్​ వేయగా బండి స్కిడ్​ అయి కింద పడిపోయారు.

కిందపడిన మంజుల పై నుంచి లారీ వెళ్లటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో నిక్షిప్తం అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.

మూల మలుపుల వద్ద ఓవర్​ టెక్​ చెయ్యొద్దని పోలీసులు తెలిపారు. మూల మలుపు వద్ద స్కూటీని లారీ ఓవర్​ టెక్​ చేసే ప్రయత్నం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Live Video: మహిళ పై నుంచి దూసుకెళ్లిన లారీ..

ఇదీ చదవండి: tragic incident in medak: అప్పు ఇప్పించాడు.. ఒత్తిడి భరించలేక యువకుడి బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.