ETV Bharat / crime

GACHIBOWLI ACCIDENT: ఆ పబ్ యజమాని, మేనేజర్​ అరెస్ట్..

author img

By

Published : Aug 3, 2021, 3:05 PM IST

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో మద్యం తాగి వాహనం నడిపిన అభిషేక్​ను, మద్యం విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ... మద్యం అమ్మిన స్నార్ట్ పబ్​ యజమాని సూర్యనాధ్​, మేనేజర్ ప్రణేశ్​​లను రిమాండ్​కు తరలించినట్లు సీఐ సురేష్ తెలిపారు.

police-have-remanded-the-culprits-of-gachibowli-road-accident
police-have-remanded-the-culprits-of-gachibowli-road-accident

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో యువకులకు మద్యం అమ్మిన స్నార్ట్ పబ్‌పై కేసు నమోదు చేశామని సీఐ సురేశ్​ తెలిపారు. అలాగే పబ్ యజమాని సూర్యనాద్​, మేనేజర్ ప్రణేశ్​, కారు నడిపిన అభిషేక్​లను రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు. బోనాల పండుగ సందర్భంగా మద్యం విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ.. స్నార్ట్ పబ్ ఎలా అమ్మిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పబ్ యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించి మద్యం అమ్మకాలు చేపట్టడం వల్లే ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాదానికి జరిగేందుకు కారణమైన పబ్ యాజమానిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామని తెలిపారు. అంతేకాకుండా మద్యం తాగి కారు నడిపిన అభిషేక్​పై కుడా కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపినట్లు గచ్చిబౌలి సీఐ సురేశ్​ వివరించారు.

రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన తరుణి చికిత్సకు సహకరిస్తోందని వైద్యులు పేర్కొన్నారు. అలాగే కారులో ముందు కూర్చున్న సత్య ప్రకాశ్​ చేతికి​ గాయమైందని.. ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: Gachibowli Accident: సరదాగా సాగిన వాళ్ల ఫ్రెండ్​షిప్ ​డే.. తీరని విషాదంతో ముగిసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.