ETV Bharat / crime

భారీగా పేలుడు పదార్థాలు పట్టుకున్న పోలీసులు

author img

By

Published : May 15, 2021, 3:59 PM IST

పేలుడు పదార్థాలు పట్టుకున్న పోలీసులు
పేలుడు పదార్థాలు పట్టుకున్న పోలీసులు

ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున్న అక్రమంగా నిల్వ చేసిన పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు రూ.15.50 లక్షల విలువైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం గ్రామీణ మండలం పిట్టలవారిగూడెం శివారులోని ఓ తోటలో అక్రమంగా పేలుడు పదార్థాలను ఉంచారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. దాడిలో సుమారు 15.50 లక్షల రూపాయల విలువైన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అనుమతి లేకుండా అక్రమంగా జిలెటెన్​స్టిక్స్‌, డిటోనేటర్లు, సల్ఫర్‌ తదితర పదార్థాలను దాచి ఉంచొద్దని ఎస్పీ విష్ణు వారియర్‌ తెలిపారు. అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈకేసుతో సంబంధం ఉన్నవారందరిని పట్టుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి: అతి తీవ్ర తుపానుగా 'తౌక్టే'.. ఆ రాష్ట్రాల్లో హైఅలర్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.