నిండు ప్రాణం తీసిన రూ.2500 అప్పు.. ఎలాగంటే..?

author img

By

Published : Sep 22, 2022, 11:05 AM IST

Updated : Sep 22, 2022, 12:56 PM IST

COMMITED SUCIDE

ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రూ.2500 అప్పు.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అసలేం జరిగిందంటే..?

ఆంధ్రప్రదేశ్​లోని​ ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పాపాయిపల్లికి చెందిన మస్తాన్ అనే వ్యక్తి బేస్తవారిపేటకు చెందిన ఇజ్రాయిల్ అనే వ్యక్తిపై రూ.2,500 అప్పు ఇవ్వలేదంటూ దాడికి పాల్పడ్డాడు. అందరి ముందు మస్తాన్ తనను కొట్టాడని ఇజ్రాయిల్ అవమానంగా భావించాడు. కూల్ డ్రింక్​లో పురుగుల మందు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పురుగుల మందు తాగానని ఇజ్రాయిల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని ఇజ్రాయిల్​ను చికిత్స కోసం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఇజ్రాయిల్ మృతి చెందాడు. ఇజ్రాయిల్ ఇళ్లకు పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వృత్తిరీత్యా మస్తాన్​ ఆటోడ్రైవర్​గా జీవనం సాగిస్తున్నాడు. ఇజ్రాయిల్ పనిచేసే గృహ యజమానులకు పెయింట్ సంబంధిత మెటీరియల్ తరలించే క్రమంలో మస్తాన్​కు ఆటో కిరాయి కింద రూ.2500 వరకు బాకీ పడ్డాడు.

ఈ క్రమంలో బేస్తవారిపేట పట్టణంలో మస్తాన్​కు ఇజ్రాయిల్ తారసపడ్డాడు. తన అప్పు చెల్లించవలసిందిగా పట్టు పట్టడంతో ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని రెండు, మూడు రోజుల్లో ఇస్తానని ఇజ్రాయిల్.. మస్తాన్​కు తెలిపాడు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని మస్తాన్ ఇజ్రాయిల్​ను కొట్టడమే కాకుండా అతని వద్ద నుంచి ఫోన్ లాక్కొని వెళ్లిపోయాడు. అందరూ చూస్తుండగా ఈ ఘటన జరగడంతో ఇజ్రాయిల్ అవమానంగా భావించాడు. దీంతో పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి: ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో భారీ చోరీ.. తెలిసిన వాళ్లే చేశారా..?

బాలికపై గ్యాంగ్​ రేప్.. నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి.. 20 రోజులకు...

Last Updated :Sep 22, 2022, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.