ETV Bharat / crime

ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ రాయుళ్లు అరెస్టు

author img

By

Published : Apr 20, 2021, 10:45 AM IST

ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ రాయుళ్లు అరెస్టు
ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ రాయుళ్లు అరెస్టు

ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న నలుగురు బెట్టింగ్ రాయుళ్లను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి నాలుగు చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న నలుగురు బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ముప్పల సాయికిరణ్(ఎన్​జీఓస్ కాలనీ), మరమోని మధు(హస్తినపురం), సోమరౌతు రాజేశ్(ఎన్​జీఓస్​ కాలనీ), ఏటికల అన్వేశ్​రెడ్డి(హస్తినపురం పోచమ్మ టెంపుల్ దగ్గర) వీరిని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు కాగా.. రాజేశ్​మాత్రం ప్రైవేటు ఉద్యోగి. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:మూడో దశ క్లినికల్ ట్రయల్స్​కు జాన్సన్​ దరఖాస్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.