జనగామ జిల్లాలో బ్లాక్​ఫంగస్​తో వ్యక్తి మృతి

author img

By

Published : May 27, 2021, 11:42 AM IST

black fungus, black fungus cases, black fungus deaths

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో బ్లాక్ ఫంగస్​తో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో యువకుడు ఈ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు.

జనగామ జిల్లాలో బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. రఘునాథపల్లి మండలం మంగలిబండ తండాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తికి 20 రోజుల క్రితం కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఆ తరువాత వైరస్ నుంచి కోలుకోగా.. కన్ను, దవడలకు వాపు వచ్చింది. బాధితుడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా...అక్కడి వైద్యులు గాంధీ ఆసుపత్రికి పంపించారు.

గాంధీలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. ఇదే మండలంలో మరో యువకుడిలోనూ బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.