Brutal Incident: ప్రేమించి పెళ్లి చేసుకుందని.. ఓ తల్లి నిర్వాకం

author img

By

Published : Sep 8, 2021, 8:29 AM IST

brutal incident

పెద్దలను ఎదురించి ఆ ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవితాన్ని సాగదీస్తున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఆమె గర్భం దాల్చింది. మరో రెండు నెలల్లో వారికి పిల్లలు పుట్టేస్తారు అనే సంబురంలో ఉండగా.. అనుకోని ఘటన చోటు చేసుకుంది. వద్దన్నా ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో తల్లి, సోదరిసి కలిసి గర్భిణికి బలవంతంగా ఆపరేషన్​ చేయించి... బిడ్డను తొలగించేశారు.

ఒకరినొకరు విడిచి ఉండలేమన్నా... ఆ ప్రేమికుల ప్రేమను అర్థం చేసుకోలేదు. వారి పెళ్లికి గౌరవం ఇవ్వలేదు. సరికదా... తల్లి కాబోతున్న కూతురిపై తల్లి పైశాచికంగా ప్రవర్తించిన అమానవీయ ఘటన నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో చోటు చేసుకుంది. జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సునీత (19) అదే గ్రామానికి చెందిన రవికుమార్​ (23) ప్రేమించుకున్నారు. ఇంట్లో వారి విషయం చెప్పినా పెద్దలు అంగీకరించలేదు.

వారి ప్రేమను గెలిపించుకునేందుకు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సునీత 8 నెలల గర్భిణి. ఆమెకు విశ్రాంతి అవసరమని డాక్టర్​ చెప్పటంతో... రవికుమార్‌ ఆమెను తమ బంధువుల ఇంటి వద్ద ఉంచారు. విషయం తెలుసుకున్న సునీత తల్లి వెంకటమ్మ, అక్క సరిత మంగళవారం ఆమె వద్దకు వెళ్లారు. అయిపోయిందేదో అయిపోయింది... అమ్మాయిన ఆస్పత్రిలో చూపిస్తామని నమ్మించి ఆటోలో తీసుకెళ్లారు.

అనుమానం వచ్చి వెళ్లేసరికే..

ఈ విషయం తెలియటంతో రవికుమార్‌ అనుమానం వచ్చి ఊర్కొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సునీత బంధువు ఒకరు కల్వకుర్తిలో నర్సుగా పనిచేస్తారు. అదే ఆసుపత్రికి తీసుకెళ్లి ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు అక్కడికి వెళ్లగా... సునీతకు ఆపరేషన్‌ చేసి బిడ్డను తొలగించిన విషయం వెలుగుచూసింది. ఈ ఘటనతో రవికుమార్​ ఖంగుతిన్నాడు. సునీత తల్లి, సోదరి, శస్త్రచికిత్స చేసిన వైద్యురాలు డా.శ్రీవాణి, ఇందుకు సహకరించిన నర్సుతోపాటు మరో ఆరుగురు బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లిని, సోదరిని రిమాండ్‌కు తరలించామని ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు. వైద్యురాలితోపాటు మిగతావారు పరారీలో ఉన్నారని వెల్లడించారు.

ఇదీ చూడండి: CORONA: థర్డ్​వేవ్​ భయం.... కొలువుకి వెళ్లాలా? వద్దా? అన్న సందిగ్ధం!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.