ETV Bharat / crime

విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌ మృతి

author img

By

Published : Jan 30, 2021, 3:21 PM IST

ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమతు చేస్తుండగా విద్యుతాఘాతానికి గురై లైన్​మెన్​ మృతి చెందిన సంఘటన మహబూబ్​నగర్ జిల్లాలో జరిగింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు బాధితున్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Linemen die of electrocution in mahabubnagar district
విద్యుదాఘాతానికి గురై లైన్‌మెన్‌ మృతి

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై రఘువర్ధన్‌ రెడ్డి అనే లైన్‌మెన్‌ మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలంలోని మాధారం గ్రామంలో జరిగింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు బాధితున్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మండల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమతు చేస్తుండగా కరెంట్ సరఫరా కావడంతో విద్యుతాఘాతానికి గురై రఘువర్ధన్‌ రెడ్డి ప్రాణాలొదిలాడు. మృతుడు పదిహేనేళ్లుగా విద్యుత్‌ శాఖలో ఒప్పంద పద్ధతిలో పని చేస్తుండగా.. రెండేళ్ల క్రితం ఆర్టీజన్‌ ఉద్యోగిగా రెగ్యూలర్‌ అయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు. రఘువర్ధన్‌ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి: ఒకే చున్నీకి ఉరేసుకుని ప్రేమికుల బలవన్మరణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.