ETV Bharat / crime

వాహనాల దొంగల ముఠా అరెస్ట్.. 13బైకులు స్వాధీనం

author img

By

Published : Feb 20, 2021, 7:36 PM IST

bike thieves arrest
బైక్​ దొంగలు అరెస్ట్​

ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురి దొంగల ముఠాను నిర్మల్​ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అపహరించిన 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

జల్సాలకు అలవాటుపడి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న అంతర్​జిల్లా దొంగల ముఠాను నిర్మల్ పట్ణణ పోలీసులు అరెస్టు చేశారు. భైంసా పట్టణానికి చెందిన మహ్మద్ అన్వర్, మహమ్మద్ హాఫీస్ ఉల్లాఖాన్, నిర్మల్​కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఉమార్, మహమ్మద్ సల్మాన్ హుస్సేన్​లు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడేవారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, నిర్మల్, భైంసాల్లో ఇప్పటివరకు 13 బైక్​లు అపహరించారు.

శుక్రవారం.. నిర్మల్​లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎస్సై రమేష్ వాహనాలు తనిఖీ చేస్తుండగా మహమ్మద్ అన్వర్​.. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బైక్​ల దొంగతనం వెలుగులోకి వచ్చింది. అన్వర్​తో పాటు మిగతా ముగ్గురినీ అరెస్టు చేసి రూ. 7 లక్షల విలువైన 13 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

ఇదీ చదవండి: మైనర్​ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ప్రియుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.