అక్రమంగా భూ రిజిస్ట్రేషన్​.. తహసీల్దార్​ ప్రమేయం..

author img

By

Published : Sep 22, 2022, 2:56 PM IST

The victim is Shivamma

Illegal Registration: ఒకరి పేరు మీద ఉన్న భూమిని మరోకరి పేరు మీద తహసీల్దార్​ అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేశారు. భర్త మరణించడంతో కుమారుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది ఆ వృద్ధురాలు. అయితే ఆ వృద్ధురాలు మరణించిందంటూ తన పేరు మీద ఉన్న భూమిని అక్రమంగా రాయించుకున్నారు వారు బంధువులు.. బాధితురాలు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేశారు.

Illegal Registration: సర్కార్‌ ఎన్ని సంస్కరణలు చేసినా.... ఎంత కఠినంగా వ్యవహరించినా.... తమలో మాత్రం మార్పు రాదంటూ మరోసారి నిరూపించారు రెవెన్యూ అధికారులు. బతికున్న వృద్ధురాలి పేరున ఉన్న భూమిని అక్రమణదారులకు తహసీల్దార్​ కట్టబెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్​ మండలంలో వెలుగు చూసింది.

భూమిని అంజమ్మ పేరు మీద మార్చిన తహసీల్దార్​: రాయికోడ్ మండలం నాగన్‌పల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల హన్మంత్ రెడ్డికి సర్వే నంబర్ 198లో 27ఎకరాల 34 గుంటల భూమి ఉంది. గతేడాది ఆయన చనిపోగా ఆ భూమిని భార్య శివమ్మ పేరిట ఫౌతీ చేయించారు. భర్త మరణించటంతో ఆమె హైదరాబాద్‌లోని కుమారుల వద్ద ఉంటోంది. ఆ 27 ఎకరాలపై కన్నేసిన హన్మంత్​రెడ్డి సోదరి శివమ్మ మరణించిందంటూ ఆ భూమిని తన పేరు మీదగా మార్చాలంటూ తహసీల్దార్​ కార్యాలయంలో స్లాట్​ బుక్​ చేసుకుంది. శివమ్మ పేరున ఉన్న భూమి మార్చుకునేందుకు హన్మంత్‌రెడ్డి మరణ ధ్రువీకరణ పత్రాన్ని అధికారులకు ఆమె సమర్పించింది. తన అన్న మరణధ్రువీకరణ పత్రం తీసుకోని, శివమ్మ పేరు మీద ఉన్న భూమినంతా తహసీల్దార్‌ రాజయ్య, రెవెన్యూ అధికారులు ఈ నెల10న అంజమ్మ పేరు మీదకు మార్చేశారు.

తహసీల్దార్​ రాజయ్య
తహసీల్దార్​ రాజయ్య

ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు శివమ్మ సంగారెడ్డి కలెక్టర్‌ను ఆశ్రయించి, ఆ భూమికి సంబంధించిన ఆధారాలను సమర్పించింది. కలెక్టర్​ సూచనతో నేరుగా ఆమె పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది. అనంతరం అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్‌ చేసిన తహసీల్దార్‌ రాజయ్యతో పాటు అంజమ్మపై బాధితురాలు రాయికల్‌ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.