ప్రేమ పేరుతో ఆకతాయిల వేధింపులు.. తట్టుకోలేక అమ్మాయిల అఘాయిత్యాలు

author img

By

Published : Dec 29, 2022, 9:00 AM IST

Updated : Dec 29, 2022, 9:08 AM IST

A Tragedy in Two Families

Tragedy in Two Families : ఆకతాయిల వేధింపులు వేరు వేరు చోట్ల ఇద్దరి విద్యార్థినులను పొట్టనబెట్టుకున్నాయి. రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. ఇద్దరు యువకుల చేష్టలతో మహబూబాబాద్‌ జిల్లాలో యువతి ప్రాణాలు తీసుకుంది. ప్రేమించకుంటే చచ్చిపో అంటూ పురుగుల మందు డబ్బాతో బలవంతం చేసిన ఘటనలో సిరిసిల్ల జిల్లాకు చెందిన మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.

ప్రేమ పేరుతో ఆకతాయిల వేధింపులు.. తట్టుకోలేక అమ్మాయిల అఘాయిత్యాలు

Tragedy in Two Families : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన యువతి మోకెనపల్లి త్రిష గంగాధరలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన కొరెపు సతీశ్‌ కొంతకాలంగా ప్రేమించాలంటూ తమ అమ్మాయిని వేధింపులకు గురిచేస్తున్నట్లు పలుమార్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ప్రవర్తన మార్చుకోని సతీశ్‌ వారి ఇంటికి వెళ్లాడు. తననే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేదంటే చచ్చిపో అంటూ పురుగుల మందు డబ్బా ఇచ్చి వెళ్లిపోయాడు. మనస్తాపానికి గురైన త్రిష.. పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది.

మహబూబాబాద్‌ జిల్లాలో ఇదే తరహా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైలుకు చెందిన బొప్పిశెట్టి సుజాత-నర్సింహారావు దంపతుల కుమార్తె సాయికీర్తి ఖమ్మంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో పాల్వంచకు చెందిన ఆటోడ్రైవర్‌ రోహిత్‌ వేధిస్తుండటంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. యువతిను ఖమ్మంలోని ఓ వసతి గృహంలో ఉంచి చదివిస్తున్నారు. అక్కడ తరుణ్‌ అనే మరో యువకుడు సాయికీర్తిని వేధించసాగాడు. చేసేది లేక అమ్మాయిని డోర్నకల్‌ మండలం తహసీల్దార్‌ బంజరలోని అమ్మమ్మ వద్దకు పంపించారు. అక్కడి నుంచి సాయికీర్తి రోజు ఖమ్మంలోని కళాశాలకు వెళ్లి వస్తుండేది.

ఇది గమనించిన రోహిత్‌ ఓ వైపు.. తరుణ్‌ మరోవైపు యువతి వెంటపడుతూ వస్తున్నారు. సెల్‌ఫోన్‌ నంబర్‌ తెలుసుకుని వేధిస్తుండటంతో మానసిక వేదనకు గురైన యువతి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఖమ్మం, హైదరాబాద్‌లో చికిత్స పొందిన సాయికీర్తి.. మూడు రోజుల తర్వాత ప్రాణాలు విడిచింది. డోర్నకల్‌ ఘటనలో సాయికీర్తి ఆత్మహత్యకు కారణమైన రోహిత్‌, తరుణ్‌పై బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సిరిసిల్ల జిల్లా ఘటనలో త్రిషను వేధించిన సతీశ్‌పై కేసు నమోదు చేసినట్లు బోయినపల్లి పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 29, 2022, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.