విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబం అంత్యక్రియలు

author img

By

Published : Jan 10, 2022, 10:21 AM IST

Updated : Jan 10, 2022, 11:13 AM IST

funeral for Vijayawada suicide Family, family suicide case

funeral for Vijayawada suicide Family : విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్ కుటుంబానికి అంత్యక్రియలు ముగిశాయి. ఇద్దరు కుమారులు సహా దంపతులకు బంధువులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అప్పులబాధతో కుటుంబం మొత్తం రెండు రోజుల క్రితం బలవన్మరణం చెందిన విషయం తెల్సిందే.

funeral for Vijayawada suicide Family: ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణకు చెందిన కుటుంబానికి నిజామాబాద్ ఆర్యవైశ్య శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. దంపతులతో పాటు ఇద్దరు కుమారుల మృతదేహాలకు వారి బంధువులు అంతిమసంస్కారాలు నిర్వహించారు. కుటుంబం మొత్తం ఒకేసారి ఉసురుతీసుకోవడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అఖిల్, ఆశిష్ స్నేహితులందరూ వచ్చి కంటతడి పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం విజయవాడలో సురేష్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. దుర్గమ్మ దర్శనానికి వెళ్లి ఇద్దరు కుమారులు సహా సురేష్ దంపతుల బలవన్మరణం చెందారు.

ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో తెలంగాణకు చెందిన బలవన్మరణం చెందింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. తండ్రి, మరో కుమారుడు కృష్ణానదిలో దూకారు. వన్‌ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రాహ్మణ విధిలో శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రంలోని 3వ ఫ్లోర్‌లోఈనెల 6వ తేదీని.. పప్పుల అఖిల్ పేరిట తెలంగాణ నుంచి వచ్చిన ఒక కుటుంబం గది తీసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు నిజామాబాద్ నుంచి శ్రీ రామ ప్రసాద్ అనే వ్యక్తి సత్రానికి ఫోన్ చేసి తన తన బావ సురేశ్‌ అప్పుల బాధతో చనిపోతున్నట్లు సమాచారం అందించారు. రాత్రి రెండున్నర గంటలకు తన బావ వద్ద నుంచి ఈ మేరకు వాయిస్‌ మెసెజ్‌లు వచ్చాయని తెలిపాడు. దీంతో సత్రం సిబ్బంది సురేశ్‌ కుటుంబం ఉన్న గదికి వెళ్లి చూడగా... అప్పటికే ఇద్దరు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతులు పప్పుల సురేష్‌(56), పప్పుల శ్రీలత కాగా...వారి కుమారులు 28 ఏళ్ల అఖిల్‌, 22 ఏళ్ల ఆశిష్‌గా గుర్తించారు.

వేధింపులే కారణమా?

రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విజయవాడలో తెలంగాణ వాసుల ఆత్మహత్య కేసులో కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. కుటుంబం ఆత్మహత్యకు ఫైనాన్స్ సంస్థల వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఇబ్బందులు పెట్టిన వారి వివరాలను లేఖలో పేర్కొన్న కుటుంబం.. వేధించిన వారి వివరాలను సెల్ఫీ వీడియోలో రికార్డు చేసి వారి బంధువులకు పంపించినట్లు సమాచారం. ఫైనాన్స్ వారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో మృతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు వారి బంధువులు తెలిపారు. ఆ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలతో వేధింపులకు పాల్పడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: అప్పులే యమపాశాలై.. దుర్గమ్మ దర్శనానికి వెళ్లి కుటుంబం బలవన్మరణం

Last Updated :Jan 10, 2022, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.