ETV Bharat / crime

Accident: ఆగి ఉన్న బస్సును ఢీకొన్న మినీవ్యాన్​.. నలుగురి పరిస్థితి విషమం

author img

By

Published : Jul 14, 2021, 11:31 PM IST

మద్యం సీసాల లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్​ ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా.. వారిలో నలుగురి పరిస్థతి విషమంగా ఉంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్​ వద్ద జాతీయరహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

Four persons serious injured in road accident
Four persons serious injured in road accidentFour persons serious injured in road accident

ఆగి ఉన్న బస్సును మినీ వ్యాన్​ ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్​ గ్రామం వద్ద జాతీయరహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిందిలా...

కోరుట్ల నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను దింపేందుకు వెంకటాపూర్​ వద్ద ఆగింది. అదే సమయంలో జగిత్యాల వైపు నుంచి మద్యం సీసాల లోడుతో వస్తున్న ఐసర్​ మినీ వ్యాన్​ ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్​ సగభాగం వరకు నుజ్జునుజ్జయింది. మద్యం సీసాలన్నీ చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి. ఆర్టీసీ బస్సు ముందు భాగాన్ని బలంగా ఢీకొనడంతో పగిలిన మద్యం సీసాలు ఎగిరి బస్సు ప్రయాణికులపై పడడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చూడండి: Dating Doctor: డేటింగ్​ యాప్​ ద్వారా డాక్టర్ ఛీటింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.