ETV Bharat / crime

ఛత్తీస్​గఢ్​ నుంచి పరామర్శకు వస్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. ఐదుగురికి గాయాలు

author img

By

Published : Nov 22, 2022, 4:42 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాక్టర్​ బోల్తాపడి ఐదుగురికి గాయాలు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రాక్టర్​ బోల్తాపడి ఐదుగురికి గాయాలు..

Tractor Overturned In Bhadradri Kothagudem District: ఛత్తీస్​గఢ్ రాష్ట్రం నుంచి కొందరు వ్యక్తులు బంధువుల వ్యక్తి దినం కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రాక్టర్​లో తెలంగాణకు బయల్దేరారు. వస్తోన్న క్రమంలో ట్రాక్టర్​ బోల్తాపడింది. ట్రాక్టర్​లో 35 మంది ఉండగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని​​ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tractor Overturned In Bhadradri Kothagudem District: మన ప్రాంతంలో పెళ్లి ఎంత బాగా జరుపుకుంటామో, ఛత్తీస్​గఢ్​లో దినం కార్యక్రమాన్ని అక్కడి ప్రజలు అంత ఘనంగా జరుపుకుంటారు. దానిలో భాగంగానే తమ బంధువుల వ్యక్తి తెలంగాణలో మరణించడంతో అతని దినం కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణకు రావడానికి ట్రాక్టర్​లో 35 మంది గిరిజనులు బయల్దేరారు.

వస్తున్న క్రమంలో తెలంగాణ బోర్డర్​, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం వద్ద ట్రాక్టర్​ బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు... క్షతగాత్రులను దగ్గరలోని​ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.