ETV Bharat / crime

ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనం

author img

By

Published : Dec 17, 2022, 6:10 AM IST

Updated : Dec 17, 2022, 2:08 PM IST

Mancherial District Fire Accident Today
Mancherial District Fire Accident Today

06:07 December 17

ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనం

ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనం

Mancherial District Fire Accident Today: మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇంటికి నిప్పు అంటుకోవడంతో.. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయాయి. శవపరీక్షను సైతం అక్కడే నిర్వహిస్తున్నారు. ప్రమాద ఘటనపై విచారణ కోసం 16 బృందాలను మంచిర్యాల డీసీపీ ఏర్పాటు చేశారు.

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో విషాదం నెలకొంది. శివయ్య అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తు అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే అవి తీవ్రరూపం దాల్చాయి. అగ్నికీలలకు ఇంటి యజమాని శివయ్యతోపాటు.. ఆయన భార్య పద్మ చనిపోయారు. పద్మ అక్క కుమార్తె మౌనికతోపాటు ఆమె ఇద్దరు పిల్లలు.. శాంతయ్య అనే సింగరేణి ఉద్యోగి సైతం అగ్నికీలలకు సజీవ దహనమయ్యారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలార్పివేశారు.

ఘటనా స్థలాన్ని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ బృందాన్ని తెప్పించారు . ఆధారాలు సేకరించేందుకు యత్నించగా.. పోలీసు శునకం గ్రామ శివారు వరకు వెళ్లి ఆగిపోయింది. మంచిర్యాల నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటన స్థలంలోనే శవపంచనామ చేస్తున్నారు. ఈ కేసును చేధించేందుకు.. 16 బృందాలు ఏర్పాటు చేసినట్లు డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. శ్రీరాంపూర్​కు చెందిన శాంతయ్య అనే సింగరేణి కార్మికుడు.. ఇక్కడ ఎందుకు ఉన్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు సజీవదహనం కావడంతో.. మంచిర్యాల జిల్లాలో సంచలనంగా మారింది.

"అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. 15 బృందాలను ఏర్పాటు చేశాం. ఏదైనా క్లూ దొరికితే కేసును పరిష్కరిస్తాం. ప్రమాదమా లేక ఏదైనా కుట్ర అనే దానిపై విచారిస్తున్నాం. వివిధ శాఖల సహకారంతో వారు ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపడతాం." - అఖిల్ మహాజన్, మంచిర్యాల డీసీపీ

ఇవీ చదవండి: దమ్మాయిగూడలో అదృశ్యమైన బాలిక.. చెరువులో శవమై..

రూ.300 కోసం దారుణం.. తమ్ముడిని చంపిన అన్న.. మంచినీళ్ల​ ట్యాంక్​లో శరీర భాగాలు..

Last Updated :Dec 17, 2022, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.