ETV Bharat / crime

ఏపీలో కలకలం రేపిన వైద్య విద్యార్థిని హత్య

author img

By

Published : Dec 6, 2022, 9:25 PM IST

Dental Student Murder in Guntur Districtr: ఏపీలోని గుంటూరు జిల్లా పెదకాకానిలో వైద్య విద్యార్థిని హత్య తీవ్ర కలకలం రేపింది. ఘాతుకానికి తెగబడిన నిందితుడు ఇప్పటికే అదుపులో ఉండగా, పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ముంబయి నుంచి వచ్చిన యువతి తల్లిదండ్రులు.. కుమార్తె మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు.

Dental Student Murder in Guntur District
Dental Student Murder in Guntur District

ఏపీలో కలకలం రేపిన వైద్య విద్యార్థిని హత్య

Dental Student Murder in Guntur District: ఎన్నిచట్టాలు తెచ్చినా ఆడబిడ్డలపై దాష్టీకాలు ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో జరిగిన డెంటల్ విద్యార్థిని తపస్వి అమానుష హత్య.. అందరినీ తీవ్రంగా కలచివేసింది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన పిన్నమనేని తపస్వి.. విజయవాడ సిద్దార్థ దంత వైద్యకళాశాల హాస్టల్‌లో ఉంటూ చదువుకునేది.

మూడ్రోజుల కిందట తక్కెళ్లపాడులోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు జ్ఞానేశ్వర్.. సోమవారం అక్కడికి వచ్చి తపస్విని దారుణంగా హత్య చేశాడు. ఆపరేషన్లకు వినియోగించే సర్జికల్ బ్లేడుతో గొంతు కోశాడు. ఆ తరువాత కూడా ఇంట్లో అటు, ఇటు ఈడ్చుకెళ్లి పైశాచికంగా వ్యవహరించాడు. తపస్వి స్నేహితురాలి కేకలతో అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగు.. తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లేసరికే ఘోరం జరిగిపోయింది.

రక్తపు మడగులో పడి ఉన్న తపస్విని హుటాహుటిన గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ దారుణ ఘటన తక్కెళ్లపాడు ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రశాంతంగా పల్లెలో ఇంతటి దారుణం జరగాడన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలంటూ తపస్విని నిందితుడు జ్ఞానేశ్వర్ కొన్నిరోజులుగా వేధిస్తున్నట్లు తెలిసిందని.. ఇప్పడు ఏకంగా అంతం చేశాడని ఆమె కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. తపస్వి తల్లిదండ్రులను మహిళా కమీషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.