ETV Bharat / crime

ఫారెస్ట్ అధికారులకు కరోనా రోగుల జలక్

author img

By

Published : Apr 23, 2021, 10:50 AM IST

Updated : Apr 23, 2021, 11:15 AM IST

పోడు భూముల్లో డోజర్​లతో సాగు చేస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. డోజర్​లను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎదురించిన తండావాసులు విఫలమయ్యారు. అధికారులను ఎలా అయినా అక్కడి నుంచి పంపించేయాలనుకున్న తండా వాసులు ఆఖరు అస్త్రంగా కరోనా రోగులను రంగంలోకి దించారు.

corona-patients-were-brought-in-to-threaten-forest-officials-at-bayyaram-mandal-in-mahabubabad
'మీ దగ్గర అధికారముంటే... మా దగ్గర కరోనా రోగులున్నారు'

మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం వెంకటాపురం శివారులోని సాంబ తాండ వాసులు... అటవీ ప్రాంతంలోని పోడు భూముల్లో డోజర్​లతో సాగు చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడకు వెళ్లారు. వారినుంచి డోజర్​లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు.

ఫారెస్ట్ అధికారులకు కరోనా రోగుల జలక్

ఎదురించిన తండా వాసులు విఫలమయ్యారు. చివరకు కరోనా పాజిటివ్​ వచ్చి హోమ్​ ఐసోలేషన్​లో ఉన్న బాధితులను తండా నుంచి ఘటనాస్థలానికి రప్పించారు. దీంతో భయపడిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఇదీ చూడండి: యమ డేంజర్‌: రోడ్లపై తిరుగుతున్న కొవిడ్ రోగులు..కారణం అదే..!

Last Updated :Apr 23, 2021, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.