Bar Conflict: తాగిన బిల్లు కట్టమని అడిగినందుకు దాడి

author img

By

Published : Oct 13, 2021, 11:26 PM IST

Bar Conflict

మద్యం తాగాక బిల్లు కట్టమని అడగడం వల్ల వాగ్వాదం (Bar Conflict) చోటుచేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో చోటుచేసుకుంది.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలోని ఓ బార్ అండ్​ రెస్టారెంట్​లో ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం తాగాక బిల్లు కట్టమని అడగడం వల్ల వాగ్వాదం జరిగింది. బిల్లు కట్టమని... బార్ యజమానితో గొడవకు దిగారు.

మద్యం సేవించిన తర్వాత గొడవ జరిగినట్లు అందులో పనిచేసే వర్కర్లు వాపోయారు. బిల్లు అడిగినందున తమను కర్రలతో బాది పారిపోయారని తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: ఒకేసారి 550 కేక్స్​ కట్ చేసి పుట్టిన రోజు వేడుక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.