ETV Bharat / crime

గర్భిణీ మృతిపై ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన

author img

By

Published : Feb 21, 2021, 11:35 PM IST

వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కూతురు మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన గర్భిణీ మరణించింది. ఈ ఘటనతో ఆస్పత్రి ముందు మృతదేహంతో ధర్నా నిర్వహించారు.

Concern of relatives in front of the hospital over the death of a pregnant women today karimnagar district
గర్భిణి మృతిపై ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన

గర్భిణీ మృతికి కారణమైన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కూతురు మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన స్వరూప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మందులు ఇచ్చి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన స్వరూప నీరసానికి గురికాగా... తిరిగి బంధువులు ఆస్పత్రికి తీసుకొచ్చారు.

బీపీ తక్కువ ఉందంటూ తమ ఆస్పత్రిలో వెంటిలేటర్ల సౌకర్యం లేదని ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం మరో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గర్భిణీ మరణించగా... బంధువులు మృతదేహంతో ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. మల్టీస్పెషాలిటీ పేరుతో రోగులను తప్పుదారి పట్టిస్తున్న వైద్యులు ఆస్పత్రిలో వెంటిలేటర్ సౌకర్యం లేదని చెప్పడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

ఇదీ చూడండి : నడిరోడ్డుపై కారు దగ్ధం.. ఎగిసిపడిన మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.