ETV Bharat / crime

పల్లె పోరు: ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జ్

author img

By

Published : Feb 21, 2021, 5:40 PM IST

ap local body elections, srikakulam
ఏపీ పంచాయతీ ఎన్నికలు, శ్రీకాకుళం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరుపాలెంలో ఇరు వర్గాల ఘర్షణతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులపైనా రాళ్లు రువ్వేంత వరకు వెళ్లింది. చివరికి... పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరుపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరికి గాయాలయ్యాయి.

పరిస్థితి అదుపు తప్పకుండా గట్టి చర్యలు తీసుకున్న పోలీసులు... రెండు వర్గాలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు.

పల్లె పోరు: ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జ్

ఇదీ చదవండి: కేటీఆర్​ పీఏనంటూ డబ్బులు డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.