ETV Bharat / crime

Bus Accident: ప్రైవేటు బస్సు బోల్తా... అందులో 40 మంది ప్రయాణికులు!

author img

By

Published : Sep 27, 2021, 8:57 AM IST

బాదంపూడి వై-జంక్షన్‌ వద్ద బస్సు బోల్తా పడింది. మలుపు తిరిగే క్రమంలో బస్సు బోల్తా పడి 20 మందికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

Bus Accident
Bus Accident

08:17 September 27

Bus Accident

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. బాదంపూడి వై-జంక్షన్ వద్ద మలుపు తిరిగే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ఘటనలో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఉంగుటూరు, తాడేపల్లిగూడేనికి చెందిన అంబులెన్సులు ఘటనాస్థలానికి చేరుకుని... క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అదే సమయంలో వర్షం కురవడంతో ప్రమాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదీ చదవండి: Cyclone Gulab Effect on Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం.. స్పెషల్ కంట్రోల్‌ రూమ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.