Accident: ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఎంపీటీసీ దంపతుల దుర్మరణం

author img

By

Published : Sep 1, 2021, 8:06 AM IST

Updated : Sep 1, 2021, 8:51 AM IST

brutal-road-accident-at-abdullapur-met-orr

08:00 September 01

అబ్దుల్లాపూర్​మెట్ వద్ద ప్రమాదం

Brutal road accident at Abdullapur Met ORR
ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌ హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (ROAD ACCIDENT) చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా తిపర్తి మండలం తానేదార్​పల్లి ఎంపీటీసీ దొంతం కవిత, ఆమె భర్త తెరాస నేత వేణుగోపాల్ రెడ్డి  ఈ ఘటనలో మృతి చెందారు. 

గత నెల 22న తమ కూతురు వివాహం వేడుకలు జరుపుకుని.. పనులు ముగిశాక అనంతరం వనస్థలిపురంలోని సహారా స్టేట్స్‌లోని తమ నివాసానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి పెద్దఅంబర్‌పేట్‌ వద్దకు రాగానే డివైడర్ వద్ద టిప్పర్ మూలమలుపు తీసుకుంటుండగా.. వేణుగోపాల్ దంపతుల వాహనం స్కార్పియోను టిప్పర్ వెనకాల నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ పరాయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated :Sep 1, 2021, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.