రంగారెడ్డి జిల్లా కందుకూరులో దారుణం జరిగింది. శ్రీశైలం హైవే పక్కన ఉన్న నేదునూర్ బస్స్టాప్లో ఓ గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తలపై బండరాయితో మోది.. గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణా రెడ్డి, కందుకూర్ సీఐ కృష్ణంరాజు హత్య జరిగిన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం బృందం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సాయంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి వుంది.
దుండగులు ఎందుకు బాధితున్ని చంపారు..? అనే విషయం తెలియాలంటే.. ముందు వాళ్లెవరో తెలియాల్సి ఉంది. అందుకోసం.. మృతుడు, నిందితుల వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి:
Sexual Abuse: లింగభేదాన్ని పక్కనపెట్టేశారు.. మానసిక వికలాంగుడని కూడా చూడకుండా..