CRIME: తల్లిని కొట్టాడని.. మేనమామపై కత్తితో దాడి

author img

By

Published : Aug 13, 2021, 7:44 PM IST

Updated : Aug 14, 2021, 9:28 AM IST

attack on uncle at mahabubabad

తల్లిపై చేయిచేసుకున్నాడని.. మేనమామపై అల్లుళ్లు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ జరుగుతుండగానే.. కత్తితో దాడి చేశారు.

తల్లిని కొట్టాడనే కారణంతో మేనమామపై అల్లుళ్లు దాడి చేశారు. కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో జరిగింది.

అసలేం జరిగింది..

ఉప్పరపల్లిలో వారం క్రితం ప్రభాకర్​ అనే వ్యక్తి.. మద్యం మత్తులో తన అక్క భారతమ్మపై చేయిచేసుకున్నాడు. ఇదే విషయాన్ని హైదరాబాద్​లో ఉంటున్న ఆమె తన కుమారులు రమేశ్​, సంపత్​లకు చెప్పింది. ఆగ్రహించిన వారు.. హైదరాబాద్​ నుంచి వచ్చి.. మేనమామ ప్రభాకర్​ను పంచాయితీకి పిలిపించారు. గ్రామపెద్దల సమక్షంలో విచారణ జరుగుతోంది. ఆ సమయంలో మాటామాటా పెరిగింది. అది కాస్త మేనమామ, అల్లుళ్ల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో మామపై కత్తితో విచక్షణరహితంగా దాడిచేశారు. ఈ ఘటనలో ప్రభాకర్​కు తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు చికిత్స కోసం వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ఇదీచూడండి: 'నేనే చంపాను.. మళ్లీ బతికిస్తాను'.. జగిత్యాలలో శవం వద్ద పూజలు

Last Updated :Aug 14, 2021, 9:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.