ETV Bharat / crime

ACCIDENT: ట్రక్కు-డీసీఎం ఢీ.. మంటలు చెలరేగి వాహనాలు దగ్ధం

author img

By

Published : Aug 13, 2021, 11:57 AM IST

గ్రానైట్​ లోడ్​తో వెళ్తున్న ట్రక్కు, డీసీఎం వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటన నల్గొండ జిల్లా ఏపీ లింగోటం వద్ద చోటుచేసుకుంది. ప్రమాదంలో మంటలు చెలరేగి రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. డ్రైవర్లకు గాయాలయ్యాయి.

ACCIDENT: ట్రక్కు-డీసీఎం ఢీ.. మంటలు చెలరేగి వాహనాలు దగ్ధం
ACCIDENT: ట్రక్కు-డీసీఎం ఢీ.. మంటలు చెలరేగి వాహనాలు దగ్ధం

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్​ లోడ్​తో వెళ్తున్న ట్రక్కు, డీసీఎం వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. మంటలు అంటుకుని రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ACCIDENT: ట్రక్కు-డీసీఎం ఢీ.. మంటలు చెలరేగి వాహనాలు దగ్ధం

గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో క్షణాల్లో మంటలు చెలరేగటంతో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేనికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Hulchul with Gun: తుపాకీతో రౌడీషీటర్‌ హల్‌చల్‌.. గాల్లోకి మూడు రౌండ్​ల కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.