ETV Bharat / crime

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జల్‌పల్లి కమిషనర్‌ అరెస్ట్..

author img

By

Published : Jul 1, 2022, 7:41 AM IST

Updated : Jul 1, 2022, 9:46 PM IST

ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో  హైదరాబాద్‌ జల్‌పల్లి పురపాలక సంఘం కమిషనర్‌ ఇళ్లు, కార్యాలయాల్లో అనిశా అధికారులు దాడులు చేశారు. బాలాపూర్‌,  హిమాయత్‌నగర్‌లోని  ఓ ప్రైవేటు కార్యాలయంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా విలువైన భూమి పత్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

ACB Raids
ACB Raids

ACB Raids: ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్‌ శివారులోని జల్‌పల్లి పురపాలిక కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌పై గురువారం రోజు అనిశా అధికారులు గురిపెట్టారు. ఆయన నివాసంతో పాటు మున్సిపల్ కార్యాలయం, సమీప బంధువు ఇల్లు, హిమాయత్​నగర్​లోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు 30న ఏక కాలంలో దాడులు చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11గంటల వరకూ సోదాలు కొనసాగాయి. అనిశా కేంద్ర పరిశోధన విభాగం డీఎస్పీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన సోదాల్లో దాదాపు 3 కోట్ల 30లక్షల ఆస్తులతో పాటు.. బినామీల పేర్లపై ఉన్న ఆస్తి పత్రాలను అధికారులు గుర్తించారు.

హిమాయత్‌నగర్‌లోని ఆయన కార్యాలయం, ఆదర్శ్‌నగర్‌లోని ఒక ఇల్లు, బాలాపూర్‌ వాసవీ కాలనీలోని ఇంట్లోంచి విలువైన పత్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్‌ స్థానికంగా ఓ స్థిరాస్తి సంస్థకు అనుకూలంగా వ్యవహరించారన్న ప్రచారం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఓ ప్రజాప్రతిధి, అయన అనుచరులు ఏసీబీకి సమాచారం ఇచ్చినట్టు అనుమానం. ఈ క్రమంలో జల్​పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్​ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 1, 2022, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.