రంగారెడ్డి జిల్లాలో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

author img

By

Published : Sep 24, 2022, 11:47 AM IST

rapes a girl

Rape on Minor Girl: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా మైలార్​దేవ్​పల్లిలో ఓ తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.

Rape on Minor Girl: రోజురోజుకి మహిళలు, బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. మనిషి అని మర్చిపోయిన కామాంధులు.. వారి దాహానికి చిన్న పిల్లలు బలియి పోతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్‌పల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న బీహార్​కి చెందిన దేవదాస్​ అనే యువకుడు బాలికపై అత్యాచారం చేశాడంటూ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

బాలిక గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గమనించిన తల్లీదండ్రులు బాలికను ఆరాతీయగా ఏడుస్తూ వివరించింది. తల్లిదండ్రులు ఓ పరిశ్రమలో పనికి వెళ్లిన సమయంలో ఇంటి పక్కనే ఉన్న దేవదాస్​ తరచు బాలికపై అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులకు వివరించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు యువకుడుని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.