ETV Bharat / crime

కరెంటు స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా మూర్ఛ.. షాక్​కు గురైన యువకుడు

author img

By

Published : Feb 2, 2022, 3:42 PM IST

Updated : Feb 2, 2022, 7:03 PM IST

Faint on Electric Pole
కరెంటు స్తంభంపైనే మూర్ఛ

Faint on Electric Pole: ప్రమాదం ఎప్పుడు.. ఏ సమయంలో.. ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేం. ఒక్కోసారి మనకున్న అనారోగ్య సమస్యలే మనల్ని చావు అంచుల వరకూ తీసుకెళ్తాయి. అలాంటి సమయంలో మనకు దగ్గరలో ఎవరైనా ఉంటే బతికి బట్ట కడతాం.. లేదంటే పరిస్థితి చేయి దాటే అవకాశమూ ఉంది. వనపర్తి జిల్లాలో విద్యుత్​ మరమ్మతులు చేస్తుండగా.. స్తంభంపైనే మూర్ఛకు గురయ్యాడు ఓ కార్మికుడు.

Faint on Electric Pole: వనపర్తి జిల్లా ఆత్మకూరులో ఓ విద్యుత్​ కార్మికుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నారాయణ పేటకు చెందిన విద్యుత్​ కార్మికుడు ఆత్మకూరులో.. కరెంటు స్తంభాలపై మరమ్మతులు చేస్తున్నారు. ఆ క్రమంలో యువకుడికి స్తంభంపైనే మూర్ఛ వచ్చింది. ఆ వెంటనే విద్యుదాఘాతానికి గురై స్తంభం పైనే కుప్పకూలిపోయాడు.

కరెంటు స్తంభంపై మూర్ఛపోయిన యువకుడిని కాపాడుతున్న తోటి కార్మికులు

యువకుడు స్తంభం పైన స్పృహ లేకుండా పడిపోవడాన్ని గమనించిన ఇద్దరు తోటి కార్మికులు.. నిచ్చెన సహాయంతో అతనిని సురక్షితంగా కిందకు దించారు. విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలపాలైన కార్మికుడిని.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి మెరుగ్గా ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: జీలుగు కల్లు తాగి నలుగురు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Last Updated :Feb 2, 2022, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.