ETV Bharat / crime

భర్త అడ్డు తొలగించాలనుకుంది.. ఆ భార్య ఏం చేసిందంటే...

author img

By

Published : Jan 10, 2023, 8:16 PM IST

Updated : Jan 10, 2023, 8:51 PM IST

Wife Killed Her Husband: ఈరోజుల్లో వివాహేతర సంబంధాలు అనే మాట ఎక్కువగా వింటున్నాం. ఈ సంబంధం వలన ఒక్కోసారి అన్యాయంగా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. ఇలానే ములుగు జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహేతర సంబంధం నిండు ప్రాణం తీసింది. ఆమెకు అడ్డుగా ఉన్నాడని ప్రియునితో కలిసి భర్తను కడతేర్చిన ఘటన మృతుని బామ్మర్ధి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

wife
wife

Wife Killed Her Husband: కలకాలం కలిసుండాల్సిన భార్య, భర్త బంధాలను వివాహేతర సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన గోడ్డె బసవయ్య, సుజాత దంపతులు. సుజాతకు అదే ఊరికి చెందిన దర్షన్ బాబుతో వివాహేతర సంబంధం ఉంది. వీరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన, ప్రియుడు బాబుతో కలిసి సుజాత భర్త గొంతు నులిమి చంపింది.

మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బసవయ్య బావమరిది లాలయ్య పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అక్రమ సంబంధం విషయంలో పంచాయితీ జరిగినట్టు లాలయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Wife Killed Her Husband: కలకాలం కలిసుండాల్సిన భార్య, భర్త బంధాలను వివాహేతర సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు గ్రామానికి చెందిన గోడ్డె బసవయ్య, సుజాత దంపతులు. సుజాతకు అదే ఊరికి చెందిన దర్షన్ బాబుతో వివాహేతర సంబంధం ఉంది. వీరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన, ప్రియుడు బాబుతో కలిసి సుజాత భర్త గొంతు నులిమి చంపింది.

మృతిపై అనుమానం వ్యక్తం చేసిన బసవయ్య బావమరిది లాలయ్య పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో అక్రమ సంబంధం విషయంలో పంచాయితీ జరిగినట్టు లాలయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 10, 2023, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.